Tuesday 16 August 2011

సర్వే బొక్కలు సమైక్య లెక్కలు

ఎన్నిదినాలు తన్లాడినా సమైక్యాంధ్రకు కారణాలేమ్ దొర్కక, తెలంగాణోల్లు అడిగిందానికి సక్కగ జవాబ్ జెప్పుడు శాతగాక దిక్కులు జూస్తున్న జీవాలకు కొత్తగ ఏది దొర్కితే గది పట్టుకొని శిగమూగాలె అనిపిస్తది. ఇప్పుడు వీల్లకు కొన్ని సర్వే లెక్కలు దొర్కినయి. గా సర్వే గూడా దేడ్‌దమాక్ గాల్లకు దగ్గట్టు ముద్దుగుంది. వాడేమ్ అడిగిండో వానికే తెల్వది. చెప్పినోల్లు ఏమన్నరో వీనికి సమజ్ గాదు. ఎట్నో అట్ల అకిర్కి వాడో టేబుల్ వీల్ల మొకాన గొట్టి దాంట్ల గింతమందిమి అడిగితే అంత మంది తెలంగాణ ఒద్దరన్నరి జెప్పంగనే మల్ల పానమ్ లేసొచ్చింది. ఎందుకంటే గీ లెక్కలు సూపిచ్చి ఇష్టమ్ వచ్చింది రాయొచ్చు. ఇగ రికార్డింగ్ డ్యాన్సులు షురు జేసుడు మొదలయింది. విశయమ్ సమజ్ గానోల్లు గూడా ఏదో రాద్దామ్ అని, గింత విషమ్ గక్కి పోదామని తయ్యారు గున్నరుగదా మరి.

వాడువీడు ఎవడో జెప్పుడెందుకు. ఎవ్వనికన్న దైర్యమ్ ఉంటె ఏదన్న ఒక్క ఊర్లెకు పొయ్యి అడ్గరాదా?. గప్పుడు ఊరోల్లంత గలిసి ఏమ్ జెప్పన్నో ఎట్ల జెప్పన్నో గట్ల జెప్తరు.

ఛత్, తెలివి తక్కువోల్లంత బాగ మోపయ్యిండ్రు మాపానాలకు.

ఏమ్ లేదు, వీల్లను దీస్కపొయ్యి మల్ల తమిళోల్లతోని గలుపాలె. వాళ్ళయితేనె మంచిగ వంగవెడ్తరు, ఎక్కువతక్కువ వొర్రితే ఇంతకు ముందు ఉరికిచ్చినట్లు రోడ్లమీద ఉరికిస్తరు. అప్పుడు రోగమ్ తిర్గి రొండ్లెకెక్కుతది.

18 comments:

  1. పక్కా సమైక్యవాద చానెల్ టివి9తో సర్వే చెయ్యిస్తే బీహార్, జార్ఖండ్, ఒరిస్సాలలో కూడా 90% మంది సమైక్యాంధ్రకి మద్దతు ఇస్తున్నట్టు నివేదికలు వస్తాయి.

    ReplyDelete
  2. Anonymous8/16/2011

    మద్దెని ఏవో చిన్నచిన్న గొడవలొచ్చినా ఆంద్రోల్లూ తమిల్సూ మొదటికెల్లి జిగ్రీదోస్తులు. జయలలిత ఆంద్రా బ్రాహ్మిన్. కరుణానిధిది కూడ తెలుగువంసమే, జయలలితకైతే తెలుగు మదర్ టంగ్ లెక్క వస్తది.

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పారు ప్రవీణ్ శర్మ గారు వీళ్ళ తీరు చుస్తే నాకు ముగ్గురు దొంగల కథ గుర్తొస్తుంది .

    " ఒక బాటసారి మేకను కొనుక్కొని తన దారిన వెళ్తుంటే , ముగ్గురు అతి తెలివి దొంగలు దానిని కాచేదానికి వేసిన పథకంలో భాగంగా , వరుసగా మేకని చూసి అది కుక్క అని చెప్పడం దానితో ఆ బాటసారి కుడా కుక్క అనే బ్రమించి దాన్ని వదిలేయడం , ఆ దొంగలు దావత్ చేసుకోవడం జరుగుతుంది " ఇప్పుడు ఈ మీడియా ఇదే పని చేస్తుంది >>>>> దీనినే ఆధినిక వ్యవహారిక భాషలో

    "" గోబెల్స్ ప్రచారం "" అంటారు

    ReplyDelete
  4. శ్రీకృష్ణ కమిటీ కోస్తా ఆంధ్రలో పర్యటించినప్పుడు ఎక్కువగా రాజకీయ నాయకులే శ్రీకృష్ణ కమిటీ క్యాంప్‌లకి వెళ్ళారు. కార్మికులూ, వ్యవసాయం చేసుకునేవాళ్ళూ ఆ కమిటీ క్యాంప్‌లకి వెళ్ళలేదు. తెలంగాణా వచ్చినా, రాకపోయినా మా బతుకులు మారవు అనుకుని కోస్తా ఆంధ్రలోనే చాలా మంది ఆ క్యాంప్‌లకి వెళ్ళలేదు. తెలంగాణాలో శ్రీకృష్ణ కమిటీ సర్వేలు చేసినా ఆ కమిటీ చాలా నిజాలు వ్రాయలేదు. ఒవైసీ కుటుంబ సభ్యులు నిజాం నవాబులకి బంధువులు కావడం వల్లే వాళ్ళు తెలంగాణాని వ్యతిరేకిస్తున్నారనే విషయం శ్రీకృష్ణ కమిటీ వ్రాయలేదు, పైగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ముస్లిం జనాభా కేవలం 7% ఉన్న కరీంనగర్ లాంటి జిల్లాలలో కూడా మత ఘర్షణలు జరుగుతాయని వ్రాసింది. ప్రభుత్వ సర్వేలే ఇటువంటి అబద్దాలు కలిగి ఉంటే ప్రైవేట్ సర్వేలు ఎలాంటి అబద్దాలు కలిగి ఉంటాయో ఊహించండి.

    ReplyDelete
  5. Anonymous8/16/2011

    వీల్ల బతుకుజెడ. ఇంకెన్ని దొంగనాటకాలు ఆడ్తరో వీల్లు. అబద్దాలు ఆదుకుంట ఎన్ని తిట్టినా ఇక్కడే ఉండాలని ఎట్లనిపిస్తుందో కదా? ఏమాత్రం సిగ్గనిపించదా వీల్లకి.

    ReplyDelete
  6. సంకర8/16/2011

    This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. Anonymous8/16/2011

    This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  8. Ramu/Somu Please delete the indecent comments posted in the name of anonymous. Those indecent comments are posted in conspiracy to defame Telanganites.

    ReplyDelete
  9. అయ్య రాము/సోము గార్లు,
    బూతు రాతలు/వ్యాఖ్యలు ప్రచురించ వద్దని మనవి.

    ReplyDelete
  10. అంతా బావుంది బాసు, మనం ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్లు పెట్టి బోలెడు కోట్లు ఖర్చు పెట్టి ఎం.పీ లనూ, ఎం.ఎల్.ఏ లను ఎన్నుకుంటాం కదా…మరి తెలంగాణా విషయంలో కూడా ఓటింగు పెట్టమని అడగచ్చుగా మీరు[మేము కూడా]. అది మానేసి బందు లంటం, రాస్తా రోకోలు అంటం, సకల జనుల సమ్మెలంటం, రైలు రోకోలంటం, బస్సు రోకోలంటం, మన ఆస్తులని మనమే తగలబెట్టుకుంటం, ఆత్మ హత్యలు చెసుకుంటం.

    దరిద్రపు ఎదవలు అందరూ కలసి సమైక్య ఆంధ్ర మరియు తెలంగాణా ఉద్యమాల్లో ఉన్నట్లున్నారు. ఒక్కడూ లాజికల్ గా ఆలోచించటంలేదు.

    ఎమో వాళ్ళకు ఏమైనా స్వప్రయోజనాలున్నాయేమో తెలియదు బాసు. తెలంగాణా ఇవ్వాలో వద్దో ఎలెక్షన్లు పెట్టమను.

    తెలంగాణా ఒక్క దానీలోనే పెడితే 80 శాతం మంది తెలంగాణా కావాలంటే ఇచ్చెయ్యమని పోరాడదాం. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో అయితే 60 శాతం ఒప్పుకుంటే తెలంగాణా ఇవ్వమని పొరాడదాం.

    అంతే గానీ మన ఆస్తులని మనమే పాడు చేసుకోవడమో లేక మన సోదరులను [సీమాంధ్ర లేక తెలంగాణా]మనమే కొట్టుకోవటం మూర్ఖత్వంగా లేదూ?

    ఇక 80 శాతం మీద మీకు డౌట్ రావచ్చును. కానీ అది కరెక్ట్, మళ్ళీ మార్చుకోలేని నిర్ణయం కాబట్టి. బాసూ ఇకనైనా అందరూ లాజికల్ గా అలోచిద్దాము.

    ReplyDelete
  11. Raamu / Somu8/16/2011

    thanks Praveen.

    ఏకలింగమ్ అన్న నమస్తే, మీరంటె మాకు రెస్పెక్ట్ అన్న.
    కాని ఇలా మమ్మల్ని కట్టడి చేయడమ్ అన్యాయమ్ అన్న. మేమెక్కడ బూతులు రాశినమన్న. మమ్మల్ని అంటవ్. ఆ లఫంగ "వేస్ట్" గాల్ల సంకరజాతోల్ల వెకిలి చేష్టలు, బూతు రాతలు మీకు కండ్లబడ్తలెవ్వ? ఆ పిచ్చికుక్కలు ఎంత మొర్గునా సప్పుడు జెయ్యలేదు. గిప్పుడు మమ్ముల్ని ఒద్దనుడు పద్దతిగాదు. మీ అసొంటోల్లు ఎందుకు రాస్తలేరు. చుసిండ్రా ఇక్కడ ఏమన్నరో (http://edisatyam.blogspot.com/2011/08/blog-post_16.html). తెలంగానోల్లందర్ని తిట్టి ఎల్లగొట్టి, మాలెక్క రాసెటోల్లను ఒద్దని బ్లాగులల్లంత ఆంద్ర పాగల్ గాల్లనే నింపుండి. మంచిగుంటది. తెలంగాణ బ్లాగర్లంత కలిసి ఓ అగ్రిగేటర్ జేసుకుంటె బాగుండేది. మా గోస మేమ్ జెప్పుకునెటోల్లమ్.

    కృష్ణ గారు,
    ఎలక్షన్స్ వరకు ఎందుకు ఇలాంటి సర్వేనే నిష్పక్షపాతంగా జేసినా నిజమ్ ఏందో తెలుస్తది. ఇంత ముందు డిసెంబర్ 2010 లో ఆంధ్రజ్యోతి పత్రిక వాల్లు ఇదే సర్వే జేసి 98% తెలంగాణ వాల్లు తెలంగాణ రాష్ట్రమ్ కావాలనుకుంటున్నరి తెల్చిండ్రు. అవ్వి ఈ సమక్య కబోదులకు కనబడవ్. ఎవ్వలన్న చెప్పినా వినబడవ్.
    ఇది చూడండి.
    http://missiontelangana.com/?p=2246


    __
    Ramu / Somu

    ReplyDelete
  12. సమైక్యవాదులు తెలంగాణావాళ్ళకి ప్రాంతీయ గజ్జి ఉందని నిరూపించడానికి అజ్ఞాత పేర్లతో బూతులు వ్రాసి అవి తెలంగాణావాళ్ళే వ్రాసారని చెపుతున్నారు. వీళ్ళ అతితెలివితేటలు ఇలాంటివి.

    ReplyDelete
  13. Raamu / Somu8/16/2011

    ఏకలింగమ్ గారు మీ సమాధానమ్ కోసమ్ చూస్తున్నమ్.

    ReplyDelete
  14. నేను మిమ్మల్ని కోరింది ఒకటి, మీరు నన్ను అడిగింది ఇంకొకటి.

    మీరు బూతులు రాస్తున్నారని నేను అనలేదు. ఒకటి రెండు అసభ్యకరంగా అనిపించిన వ్యాఖ్యలు చూసాను కాబట్టి అవి మీ బ్లాగులో ప్రచురించ వద్దు అని చెప్పింది. అలా ఏ బ్లాగులో చూసినా చెప్పేవాడిని.

    ఇక మీరు చెప్పిందానికి కొనసాగింపుగా ఒక చిన్న ఉదాహరణ: రోడ్డు మీద పోతున్నప్పుడు మిమ్మల్నో పిచ్చికుక్క చూసి మొరిగితే దాని కొట్టి నాకు తెలంగాణ కావాలి అంటే వస్తుందా, రాదు. అలా అని అది మొరగడం ఆపుతుందా ఆపదు. అది దాని జాతి లక్షణం. గట్టిగా కొట్టి పంపిస్తే వెళ్ళి మళ్ళీ కొంత సేపటికి ఇంకో నాలుగు కుక్కలను వెంటతెచ్చుకొని మొరుగుడు ఎక్కువ చేస్తది. కానీ ఆపదు. ఈ కుక్కలను తరిమినంత మాత్రాన తెలంగాణకు వచ్చే లాభం లేదు. అవి మొరగడం వలన వచ్చే నష్టమూ లేదు. కొంచెం చికాకు తప్ప.

    ఈ సర్వే గురించో చిన్న మాట: అది చూసి ఆవేశంలో రాసినట్లు ఉన్నారు. ఇలాంటి అబద్దపు సర్వేలు, అసత్య ప్రచారాలు ఏమీ చేయలేవు. తెలంగాణలో వివక్షను చూసిన వారికి ఏటువంటి అధారం అవసం లేదు. అలాగే తెలంగాణ వ్యతిరేకులకు ఎవరే సాక్ష్యం చూపించినా సరిపోదు. ఇప్పుడు బయటకొచ్చిన ఈ భూటకపు సర్వేలాంటివి ఇప్పుడు కొత్త గాదు. ఈ సర్వేను చేసిన సంస్థ ఉన్నతాధికారే అదంతా బిగ్ ఫ్రాడ్ అని కొట్టిపారేసాడు. ఈ సర్వే పట్టుకోని ఎగురుతున్న వాళ్ళు దాన్ని చూసారో లేదో మరి.

    నేను రాయడం గురించి: నేను ఇప్పుడు బ్లాగులకు ఎక్కువ సమయం కేటాయించలేకున్నాను. ఇక చిల్లర రాతలు రాసేవాళ్ళంటారా, కొన్ని రోజులు వాళ్ళ మానాన వాళ్ళను వదిలేస్తే ఇప్పుడు కాకున్నా ఇంకా కొన్ని రోజులకన్న తెలివితెచ్చుకుంటరు అని నా నమ్మకం. అదీ గాక, సత్యాన్వేషి, శ్రీకాంతాచారి, విశ్వరూప్ ఇలా కొంతమంది కలిసి తెలంగాణ వ్యతిరేకులందరికి దమ్ము మెస్లకుంట చేస్తున్నరు కదా. అది చాలదా?

    తెలంగాణ బ్లాగర్లు కోసం ఓ అగ్రిగేటర్:
    అలోచించదగ్గ విశయం. "అవసరం అయితే" నావంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను.

    ఇదే చివరి కామెంట్. ఈ చర్చను ఇంతకంటే ఎక్కువ పొడిగించలేను.

    take care.

    ReplyDelete
  15. తెలంగాణా బ్లాగర్ల కోసం అగ్రెగేటర్ నేనూ పెట్టగలను కానీ నా సర్వర్ వేగం రెండు అగ్రెగేటర్లు నడపడానికి సరిపోదు. ఎందుకంటే క్రాన్ రన్ చేసేటప్పుడు ఒత్తిడి పెరిగి కొన్ని సార్లు SQL డేటా బేస్ కూడా ఆగిపోతుంది. ఉన్న అగ్రెగేటర్‌లోనే తెలంగాణా బ్లాగులు అనే కొత్త కాటెగరీ పెట్టగలను. చూద్దాం.

    ReplyDelete
  16. అగ్రెగేటర్ విషయంలో సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు మెయిల్ పంపండి. నా మెయిల్ అడ్రెస్ praveen@greenhostindia.com

    ReplyDelete
  17. Anonymous8/17/2011

    ABBA PRAVIN SARMA GAARU MEERU EDO MOTTAM ANDHRA KI REP LAA MATLAADUTUNNARU.QUISLINGS (VIBHEESHANA)LIKE U ARE ALWAYS THERE.DONT TRY TO TAKE VAKALAT ON BEHALF OF ANDHARA,PLEASE.

    SREERAMA,CHENNAI

    ReplyDelete
  18. Who are real quislings? Telangana Congress leaders who betray their own region for servitude under samaikyandhra are real quislings.

    ReplyDelete